ETV Bharat / sports

Mohali Test Day1: తొలి రోజు టీమ్​ఇండియా భారీ స్కోర్​.. పంత్​ వీర బాదుడు

author img

By

Published : Mar 4, 2022, 5:08 PM IST

Updated : Mar 4, 2022, 5:26 PM IST

India Vs Srilanka First Test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. పంత్​ లంక బౌలర్లపై విరుచకుపడి 97 బంతుల్లోనే 96 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది భారత్​.

Mohali Test Day1
తొలి రోజు టీమ్​ఇండియా భారీ స్కోర్​.. పంత్​ వీర బాదుడు

Mohali Test: పంజాబ్​ మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత డాషింగ్ బ్యాటర్​ రిషభ్ పంత్​ విధ్వంసకర ఇన్నింగ్స్​తో ఈ భారీ స్కోరు సాధించింది. భారత్​ మూడు వికెట్లు కోల్పోయాక క్రీజులోకి వచ్చిన పంత్ మొదట్లో ఆచితూడి ఆడినా.. అర్ధ సెంచరీ తర్వాత బ్యాట్​ను ఝుళిపించాడు. సిక్సర్లు ఫోర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 97 బంతుల్లో 96 చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్​ తొలి వికెట్​కు 52 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ 28 పరుగుల వద్ద లహిరు కుమార బౌలింగ్​లో లక్మల్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్​ 33 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

Kohli 100th test

కోహ్లీ ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే..

రెండేళ్లుగా విరాట్​ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. టీమ్​ఇండియా రెండు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ కుదురుకున్నట్లే కన్పించాడు. హనుమ విహారితో కలిసి మూడో వికెట్​కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం 45పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 44వ ఓవర్లో లంక స్పిన్నర్​ ఎంబుల్దేనియా వేసిన బంతికి క్లీక్ బౌల్డ్​గా వెనుదరిగాడు. దీంతో స్టేడియంలో కాసేపు నిశ్శబ్దం ఆవహించింది. అయితే ఈ మ్యాచ్​లో 8000 పరుగులు మైలురాయిని మాత్రం కోహ్లీ అధిగమించాడు. 38 పరగుల వద్ద ఈ రికార్డును చేరుకున్నాడు.

కోహ్లీ ఔటైన కాసేపటికే 58 పరగులు చేసిన హనుమ విహారి కూడా జట్టు స్కోరు 175వద్ద విశ్వ ఫెర్నాండో బౌలింగ్​లో బౌల్డ్​గా అవుటయ్యాడు.

Rishabh pant news

పంత్ విధ్వంసం..

కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్​ మొదట ఆచితూచి ఆడాడు. శ్రేయస్​ అయ్యర్(27)తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన హాఫ్​ సెంచరీ పూర్తి చేశాక ఫోర్లు, సిక్సర్లతో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే జడేజాతో కలిసి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడనుకునే సమయంలో అనూహ్యంగా లక్మల్​ బౌలింగ్​లో బౌల్డ్​ అయ్యాడు పంత్​. దీంతో కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 45, రవిచంద్రన్ అశ్విన్ 10 ​పరుగులతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంక బౌలర్లలో లసిత్​ ఎంబుల్దేనియా రెండు వికెట్లు తీయగా..లక్మల్​, ఫెర్నాండో, లహిరు కుమార, దనంజయం డిసిల్వ తలో వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: వందో టెస్టులో కోహ్లీ భావోద్వేగం.. ద్రవిడ్ స్పెషల్​ గిఫ్ట్​

Last Updated : Mar 4, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.