ETV Bharat / sports

'3టీ క్రికెట్​లో ఆడటం గర్వంగా ఉంది'

author img

By

Published : Jul 21, 2020, 1:55 PM IST

దక్షిణాఫ్రికాలో కరోనా తర్వాత 3టీ క్రికెట్​ పునః ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్​ పట్టిన ఏబీ డివిలియర్స్​... తనదైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్​ ద్వారా దాదాపు కోటి 13 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. కరోనా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రికెట్​ రంగంలోని కార్మిక కుటుంబాలకు అందజేయనున్నారు.

3tc
త్రీ టీమ్​ క్రికెట్(3టీసీ)

త్రీ టీమ్​ క్రికెట్(3టీసీ) సాలిడారిటీ కప్పు మ్యాచ్​లో పాల్గొన్నందుకు గర్వంగా ఉందని చెప్పాడు దక్షిణాఫ్రికా క్రికెట్​ జట్టు మాజీ సారథి ఏబీ డివిలియర్స్​. ఈ టోర్నీ ద్వారా 1 కోటి 13 లక్షల రూపాయలకు పైగా విరాళాలు సేకరించారు. ఇందులో దాదాపు 90 లక్షల రూపాయలను క్రికెట్​ రంగంలో పనిచేస్తూ.. ప్రస్తుతం కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అందించనున్నారు. మిగతా మొత్తాన్ని కెప్టెన్లు సూచించిన పలు ఛారిటీలకు అందజేస్తారు.

AB de Villiers
ఏబీ డివిలియర్స్​

" మహమ్మారి సమయంలో బయటకు వచ్చి ఆడటం వెనుక చాలా ముఖ్యమైన కారణముంది. దక్షిణాఫ్రికాలోని సాలిడారిటీ కోసం ఇదంతా చేశాం. దేశంగా అందరం ఒకటేనని చాటిచెప్పాం. అదే నాకు కావాల్సింది. విరాళాలు సేకరించడం చాలా ఆనందాన్నిచ్చింది" అని డివిలియర్స్​ చెప్పుకొచ్చాడు.

ఒకే మ్యాచ్​లో మూడు జట్లు ఆడేలా ఒక కొత్త ఫార్మాట్​ రూపొందించింది దక్షిణాఫ్రికా బోర్డు. కరోనా తర్వాత ఆటను పునః ప్రారంభించడానికి ఈ టోర్నీ ఉపయోగపడింది. కొవిడ్​-19 లాక్​డౌన్​ వల్ల మార్చి నుంచి క్రికెట్​ బంద్​ అయిన విషయం తెలిసిందే.

డివిలియర్స్​ సారథ్యం వహించిన ఈగల్స్​ జట్టు మొదటి ఎడిషన్​లోనే స్వర్ణం గెలుచుకుంది. ఈ మ్యాచ్​లో 24 బంతుల్లో 61 పరుగులతో దుమ్ములేపాడు ఏబీడీ.

ఇదీ చూడండి: స్వర్ణం సాధించిన డివిలియర్స్​ జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.