ETV Bharat / sitara

ఎస్పీ బాలు క్లిష్ట దశను దాటేశారు: రజనీకాంత్

author img

By

Published : Aug 17, 2020, 1:49 PM IST

గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యంపై స్పందించిన కథానాయకుడు రజనీకాంత్.. ఆయన క్లిష్ట దశను దాటేశారని, త్వరగా కోలుకోవాలని అన్నారు.

ఎస్పీ బాలు క్లిష్ట దశను దాటేశారు: రజనీకాంత్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సూపర్​స్టార్ రజనీకాంత్.. త్వరగా కోలుకోండి బాలు సార్ అంటూ చెప్పిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆయన క్లిష్టమైన దశను దాటేశారని అన్నారు.

"ఎస్పీ బాలు.. 50 ఏళ్ల నుంచి ఎన్నో భాషల్లో వేల పాటల పాడి, తన గానమృతంతో కోట్లాది మంది హృదయాల్ని రంజింపజేశారు. ప్రస్తుతం కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో ఉన్న ఆయన క్లిష్ట దశను దాటేశారని తెలిసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. బాలు సార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను"

-సూపర్​స్టార్ రజనీకాంత్

ఇటీవలే కరోనా సోకిన బాలు.. చెన్నైలోని ఎమ్​జీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. ఇంతకు ముందు కంటే శ్వాస బాగా తీసుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్, ఆదివారం వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.