ETV Bharat / sitara

'టికెట్ రేట్లపై ఆ నిర్ణయం.. ప్రేక్షకుల్ని అవమానించడమే!'

author img

By

Published : Dec 23, 2021, 12:27 PM IST

Updated : Dec 23, 2021, 12:55 PM IST

Nani about AP Tickets issue: ఏపీ ప్రభుత్వం టికెట్​ ధరలను తగ్గించడంపై మరోసారి స్పందించిన హీరో నాని అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.

నాని శ్యామ్​సింగరాయ్​, Nani shyam singha roy
నాని శ్యామ్​సింగరాయ్​

ప్రెస్​మీట్​లో మాట్లాడుతున్న హీరో నాని

Nani about AP Tickets issue: ఏపీ సినిమా టికెట్ల విషయమై సంచనల వ్యాఖ్యలు చేశారు హీరో నాని. టికెట్​ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.

"(టికెట్ రేట్లు విషయంలో) ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్​ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే (డిసెంబర్ 24) సినిమా రిలీజ్​ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్​ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది."

-నాని, హీరో

'శ్యామ్​ సింగరాయ్' కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారని నాని చెప్పారు. ఈ సినిమా క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్​తో.. ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన​ హ్యాంగ్​ఓవర్​తో ఇంటికెళ్తారని అన్నారు. ఇక తన పేరు ముందు 'నేచురల్ స్టార్'​ అనే పదాన్ని తీసేద్దామనుకుంటున్న తెలిపారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలకానుంది.

ఇదీ చూడండి: 'శ్యామ్​సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని

Last Updated :Dec 23, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.