నా ఒకే ఒక్క జీవితం 'సినిమా'కే అంకితం.. ప్రేక్షకుల కోసం 'రన్​ రాజా రన్​'లా పరిగెడతా: శర్వానంద్​

author img

By

Published : Mar 6, 2023, 9:40 PM IST

Sharwanand Latest Post On 20 Years Cinema Industry

టాలీవుడ్​ యంగ్​ హీరో శర్వానంద్​ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ ఎమోషనల్​ పోస్ట్​ను ట్విట్టర్​లో షేర్ చేశారు. తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

టాలీవుడ్​ యంగ్​ హీరోల్లో శర్వానంద్​ ఒకరు. సోమవారంతో శర్వానంద్ సినీ కెరీర్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు శర్వానంద్​. దీనికి సంబంధించి ఓ భావోద్వేగమైన పోస్ట్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఇక ఈరోజు శర్వానంద్​ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విషెస్​ చెప్పిన అందరికీ ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు శర్వానంద్​.

'20 ఏళ్లుగా కెమెరా ముందు ఉంటూ సిల్వర్​ స్క్రీన్​పై మీ అందరినీ అలరిస్తున్నాను. ఈ రెండు దశాబ్దాల నా కెరీర్​లో ఎన్నో భావోద్వేగాలతో కూడిన స్నేహాలు, కష్టాలు, ఎత్తుపల్లాలు , కుంగుబాట్లు, చిరునవ్వులు, పోరాటాలను ఆస్వాదించాను. బహుశా వేరే మార్గంలో ఇవి చూసేవాడిని కాదేమో. ఈ ప్రయాణంలో నా వెన్నంటి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని ఉన్నతంగా నిలిపడం సహా నన్ను మంచి వ్యక్తిగా మారేలా చేశాయి. రెండు దశాబ్దాల నా సినిమా కెరీర్​ నాకెన్నో గొప్ప బాధ్యతల్ని నేర్పించింది. నా ఈ 'ఒకే ఒక్క జీవితం' సినిమాకే అంకితం. 20 ఏళ్ల క్రితం 'శ్రీకారం' చుట్టిన ఈ నా సినీ 'ప్రస్థానం' మర్చిపోలేనిది. ఈ సినీ ప్రపంచంలో నా 'గమ్యం' ఇంకా చాలా దూరం మిగిలి ఉంది. మంచి చిత్రాలతో మీ అందరినీ అలరించేందుకు ఎప్పుడూ 'రన్​ రాజా రన్'​లా పరుగులు పెడుతూనే ఉంటాను. ఇందుకోసం కష్టపడి పని చేస్తానని మీకు మాటిస్తున్నాను. అయితే మీరు 'శతమానం భవతి' అంటూ నాకిచ్చే ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమవుతుంది.' అంటూ తాను నటించిన పలు సినిమాల పేర్లను జోడిస్తూ రాసుకొచ్చారు శర్వానంద్​.

Sharwanand Latest Post On 20 Years Cinema Industry
శర్వానంద్ ఎమోషనల్​ ట్వీట్​​

20 ఏళ్లు.. 34 సినిమాలు..
'అయిదో తారీఖు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్‌ హీరో శర్వానంద్‌. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు అంతగా ఆదరించలేదు. ఇక తర్వాత 'యువసేన'తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్నారు. దీంతో శర్వానంద్​కు మంచి పేరు కూడా వచ్చింది. 'సంక్రాంతి', 'లక్ష్మి' సినిమాల్లో విక్టరీ వెంకటేశ్​​ తమ్ముడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 'అమ్మ చెప్పింది'లో తన నటనతో అందరినీ మెప్పించారు. 'గమ్యం' సినిమాతో తన సినీ జీవితానికి యూటర్న్​ వచ్చినట్లయింది. 'రన్​ రాజా రన్​'తో టాలీవుడ్​లో మరింత క్రేజ్​ను సంపాదించుకున్నారు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'శతమానం భవతి'తో క్లాసికల్​ ఆడియన్స్​ దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు.

ఇకపోతే డైరెక్టర్​ శ్రీరామ్​ ఆదిత్య దర్శకత్వంలో హీరో శర్వానంద్​ తన 35వ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ లండన్​లో ప్రారంభమైంది. ఈ రోజు(మార్చి 6న) శర్వానంద్​ 39వ జన్మదినం సందర్భంగా ఆయనపై తీసిన ఓ ఫొటోషూట్​కు సంబంధించిన దృశ్యాల​ను విడుదల చేసింది ​చిత్ర యూనిట్​. కాగా, శర్వానంద్​ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్​ అబ్దుల్​ వహాబ్​ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఇటీవల శర్వానంద్​ రక్షితా రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని తన బ్యాచ్​లర్​ లైఫ్​కు ముగింపు పలికిన విషయం తెలిసిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.