ETV Bharat / entertainment

నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!

author img

By

Published : Apr 21, 2023, 12:25 PM IST

Updated : Apr 21, 2023, 1:06 PM IST

Naresh Pavitra Lokesh Malli Pelli: టాలీవుడ్​ సీనియర్​ నటుడు నరేశ్​, నటి పవిత్రా లోకేశ్​ 'మళ్లీ పెళ్లి'కి.. ముహూర్తం ఫిక్స్ అయింది!.. అవునండీ నిజమే!!.. ఆ ముహుర్తం ఎప్పుడంటే?

naresh pavitra lokesh malli pelli movie teaser released
naresh pavitra lokesh malli pelli movie teaser released

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే! త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు! ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. అయితే అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్ మొదట్లోనే డాక్టర్ నరేశ్​ వీకే 50 గోల్డెన్ ఇయర్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ కృష్ణ బ్యానర్ కింద నరేశ్​ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి కథతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు ఎమ్మెస్ రాజు. ఇప్పటికే ఈ మళ్లీ పెళ్లి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రాగా.. తాజాగా టీజర్​తో మరోసారి మేకర్స్ ఆసక్తి పెంచారు. ఈ టీజర్ వనితా విజయ్‌కుమార్ మీడియా సమావేశంతో మొదలవుతోంది. తన భర్త తనను మోసం చేశాడని, అతడో మృగం అని అంటుంది. మరోవైపు నరేశ్​ అదే సమయంలో పవిత్రా లోకేష్ తో రొమాన్స్​లో మునిగి తేలుతుంటారు. ఇక ఈ టీజర్​ను కూడా చాలా ఆసక్తిగా ముగించారు. నరేశ్​, పవిత్ర ఒకరికొకరు కన్ను కొట్టుకుంటూ లోపలికి వెళ్దామా అన్నట్లుగా ముగించారు. ఇప్పటికే భిన్నమైన స్టోరీ లైన్లతో వస్తున్న ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు కూడా అలాంటి స్టోరీలైన్​తో వచ్చారు.

ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన‍్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Last Updated : Apr 21, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.