సూపర్​ స్టార్​ స్పెషల్​ ట్వీట్​.. మహిళలకు మహేశ్​ బాబు​ చెప్పింది ఇదే!

author img

By

Published : Mar 8, 2023, 5:16 PM IST

International Womens Day 2023 Mahesh Babu

మహిళలందరికీ సూపర్​ స్టార్​ మహేశ్​​ బాబు ఉమెన్స్​ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్​ ట్వీట్​ చేశారు. మహిళల విజయం ప్రపంచం జరుపుకుంటోందని కొనియాడారు. ఇంకా ఏమన్నారంటే..

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్​ వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ మేరకు.. "మీ శక్తి సామర్థ్యాలు, సాధించాలనే పట్టుదల, అచంచలమైన సంకల్పం ఎప్పటికీ కొనసాగుతుంది. మీ విజయాలను ప్రపంచం జరుపుకుంటోంది. నా భార్యకు.. అలాగే మహిళలందరికీ ఉమెన్స్​ డే​శూభాకాంక్షలు" అని మహేశ్​ ట్వీట్​ చేశారు.

తన విజయానికి మెయిన్ పిల్లర్​​ తన భార్యే అని మహేశ్​ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, ఒకప్పుడు ఇద్దరూ సినిమాల్లో దూసుకెళ్లిన తారలే. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్​బాయ్​ చెప్పారు. మహేశ్​ బాబు తన కెరీర్​పై ఫోకస్​ పెట్టేలా.. ఇళ్లు, పిల్లలు, వ్యాపారం లాంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు నమ్రత. తన భార్య త్యాగాలు.. ఆమె చేసిన సపోర్టును గురించి మహేశ్​ చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు.

International Womens Day 2023 Mahesh Babu
మహేశ్​ బాబు, నమ్రత

ఇక, గత నెల ఈ సెలెబ్రిటీ కపుల్​ తమ 18వ వివాహ వార్షికోత్సావాన్ని జరుపుకున్నారు. ఆ రోజు కూడా మహేశ్​ బాబు స్పెషల్​ పోస్టు పెట్టారు. '18 ఏళ్లుగా కలిసి ఉన్నాం. ఈ బంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి. హ్యాపీ యానివర్సరీ నమ్రత' అంటూ రాసుకొచ్చారు. మరవైపు, నమ్రత కూడా ఓ అపురూప చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. 'మనం తీసుకున్న ఈ బెస్ట్​ నిర్ణయానికి 18 ఏళ్లు. హ్యాపీ యానివర్సరీ మహేశ్​బాబు' అంటూ పోస్టు పెట్టారు.

కాగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో వెండితెరపై ఈ తారలిద్దరూ సందడి చేశారు. ఆ సినిమా షూటింగ్‌లోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత కొంతకాలానికే వీరి స్నేహబంధం.. ప్రేమగా మారింది. ఆపై వివాహానికి దారి తీసింది. పెళ్లికి ముందు ఎన్నో బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన నమ్రత.. చివరిగా అంజి చిత్రంలో చిరంజీవికి జంటగా కనిపించారు. వివాహం తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు.

ఇక, మహేశ్​ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సూపర్​ స్టార్​ త్రివిక్రమ్​ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్​లో వచ్చిన అతడు, ఖలేజా ఘన విజయాలు సాధించాయి. దీంతో 12 తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్​పై కుడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎస్​ఎస్​ఎమ్​బీ 28 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో మహేశ్​ సరసన పూజా హెగ్డే ఆడిపాడనుంది. ఈ మూవీని హారిక, హాసిన్​ బ్యానర్​పై ఎస్​ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్​.. దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ప్రపంచ సాహసికుడి కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం.

  • Celebrating your strength, resilience, and unwavering determination today and everyday. Happy Women's Day to mine and all the women! 🤗🤗🤗

    — Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.