ETV Bharat / entertainment

ఆస్కార్​ తర్వాత మళ్లీ ఒకే స్టేజ్​పై తారక్​-చరణ్​.. ఈ సారి ఎందుకంటే?

author img

By

Published : Mar 20, 2023, 6:24 PM IST

హీరోలు రామ్​ చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ ఇద్దరు కలిసి త్వరలో ఒకే వేదికపై కనిపించబోతున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇండస్ట్రీలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వీరిద్దరూ ఏ స్టేజీని పంచుకోనున్నారంటే..

heroes ram charan ntr in akhil agent
ఏజెంట్ ప్రమోషన్స్​కి రామ్ చరణ్​ ఎన్టీఆర్

'ఆర్​ఆర్​ఆర్'​ ఆస్కార్​ తర్వాత మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్​, యంగ్ ​టైగర్​ ఎన్టీఆర్​ ఇద్దరిని త్వరలో మరో వేదికపై కలిసి చూడబోతున్నాం! అదే యంగ్​ హీరో అఖిల్​ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్​ ప్రమోషన్స్​ కోసం ఏర్పాటు చేయనున్న ప్రీ రిలీజ్​ కార్యక్రమంలో వీరిద్దరూ సందడి చేయనున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్​. అయితే దీనికి సంబంధించి అఫిషియల్​ అనౌన్స్​మెంట్​ రాకపోయినప్పటికీ తమ క్లోజ్​ ఫ్రెండ్​ సినిమా ప్రచారం కోసం నిర్వహించే ఈ ఈవెంట్​లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం తేదీ, వెన్యూకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

అయితే దర్శకుడు సురేందర్​ రెడ్డి.. సైరా నరసింహారెడ్డి తర్వాత చేసిన చిత్రం ఏజెంట్​. దీంతో భారీ అంచనాల‌తో ఈ చిత్రం రూపొందింది. అలాగే దీని ప్ర‌మోష‌న్స్‌ ఖర్చు కోసం కూడా మేకర్స్​ వెనకాడటం లేదని తెలిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏజెంట్ ప్రీ రిలీజ్‌ కోసం భారీగానే ప్లాన్ చేశారట. ఇందుకోసం తారక్​-చరణ్​​ హీరోలిద్దరిని ఆహ్వానించారట హీరో అఖిల్​ అక్కినేని.

ఇక అఖిల్​ సినిమాల విషయానికొస్తే.. 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాతో 2021లో బాక్సాఫిస్​ వద్ద సందడి చేశారు అఖిల్​. దీంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అఖిల్. తాజాగా 'ఏజెంట్​' మూవీతో ఆడియెన్స్​ను మరో సారి అలిరించేందుకు సిద్ధమయ్యారు. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రూపొందించారు​. ఏజెంట్​ మూవీని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్స్‌పై ప్రొడ్యూస్​ చేశారు.

ఇక సురేందర్​ రెడ్డి, అనిల్​ సుంకర ఇద్దరు కిలిసి ఈ సినిమాని నిర్మించారు. అయితే నిర్మాతగా సురేందర్​ రెడ్డికి ఇదే తొలి చిత్రం. హీరోయిన్​గా సాక్షి వైద్య అలరించనున్నారు. కేరళ హీరో మమ్ముట్టి కీలకమైన క్యారెక్టర్​లో కనిపించనున్నారు. పాన్‌ ఇండియన్​ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఏజెంట్ మూవీ షూటింగ్ దాదాపు మూడేళ్లు పాటు జరిగింది. ఈ సినిమాలో 8 ప్యాక్స్​తో అఖిల్ కనిపించబోతున్నారు. ఇందులోని పాత్ర కోసం బాడీ ఫిట్​నెస్​ కోసం చాలానే కష్టపడ్డారు అఖిల్​. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతోన్న 'సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌'(సీసీఎల్​)లో టాలీవుడ్‌ టీమ్‌ 'తెలుగు వారియర్స్‌'కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు అఖిల్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.