ETV Bharat / entertainment

సమంత 'యశోద' సినిమా మధ్యలో అల్లరి నరేష్​.. అదేంటబ్బా?

author img

By

Published : Nov 10, 2022, 9:53 PM IST

Updated : Nov 10, 2022, 10:04 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ నటించిన 'యశోద' చిత్రం శుక్రవారం ధియేటర్లలోకి రానుంది. అయితే అల్లరి నరేష్​.. 'యశోద' సినిమా మధ్యలో కనిపించనున్నారు. అదెందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

allari naresh yasodha
allari naresh yasodha

Allari Naresh Movie: అల్లరి నరేష్ హీరోగా రూపొందిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టీమ్ ప్రమోషన్‌‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్‌కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్‌ను నవంబర్ 12న విడుదల చేస్తున్నారు.

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' థియేట్రికల్ ట్రైలర్‌.. సమంత 'యశోద' ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సామ్​ సినిమా మధ్యలో అల్లరి నరేష్​ కనిపించనున్నట్లు ఆయన ఫ్యాన్స్​ పోస్టులు పెడుతున్నారు. అయితే ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ గురువారం రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కనే మరో టాలెంటెడ్ యాక్టర్ శ్రీతేజ్ కూడా కనిపిస్తున్నారు. నరేష్ చేయి పట్టుకుని చాలా సీరియస్‌గా తీసుకెళ్తున్నారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

Last Updated :Nov 10, 2022, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.