ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్​.. ఇప్పుడు నిర్మాత

author img

By

Published : Nov 19, 2022, 5:15 PM IST

Actress Charmi childhood photo viral

పై ఫొటోలో ఉన్న చిన్నారి తెలుగు చిత్రసీమలో స్టార్ ఎదిగింది. ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి చిత్రాలను రూపొందిస్తోంది. ఇటీవలే ఈమె నిర్మించిన ఓ సినిమా ఫ్లాప్​ అయింది. ఆమెను గుర్తుపట్టగలరా?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్​ స్టాటస్​ను అందుకుని ఆ తర్వాత కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్​ కూడా ఒకటి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ బ్యూటీ.. తక్కువ వయసులోనే తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్​గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్​లో కూడా నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే ఛార్మి.

ఛార్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్​లో జూనియర్ ఆర్టిస్ట్​గా 'ముజ్ సే దోస్తీ కరోగి' చిత్రంలో నటించింది. పదిహేనవ ఏటా తమిళంలో 'కాదల్‌ అలివదిల్లయ్‌', మలయళంలో ఆమె చేసిన ' కట్టుచెంబాకమ్‌' రెండు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. ఆ తర్వాత తెలుగు లో 'నీతోడు కావాలి' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రం కూడా పెద్దగా హిట్ కాలేదు.

అనంతరం క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన 'శ్రీఆంజేనేయం' చిత్రంతో గ్లామర్ పాత్రలో కనిపించి కుర్రాళ్లకు కిర్రెక్కించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. ఐటమ్ సాంగ్స్​లో నటించి కుర్రాళ్లను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే కొద్ది కాలం దూరమైన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​తో కలిసి సినిమాలు చేస్తోంది. అలా ఈ ఇటీవలే ఆమె సహా నిర్మాతగా వ్యవహరించిన లైగర్​ పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుంది.

ఇదీ చూడండి: అతడితో దిశాపటానీ హాట్ సెల్ఫీ ఎవరబ్బా ఈ మిస్టిరీయస్​ పర్సన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.