ETV Bharat / crime

dead bodies found in pond: కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?

author img

By

Published : Nov 16, 2021, 10:19 AM IST

Updated : Nov 16, 2021, 11:34 AM IST

two-dead-bodies-found-at-dadaipalli-gachukunta-in-medak-district
కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?

10:18 November 16

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఘటన

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో రెండు మృతదేహాలు(dead bodies found in pond) లభ్యం కావటం స్థానికంగా కలకలం రేపింది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నాలుగేళ్ల రిశ్వంత్‌, రెండేళ్ల రక్షిత చనిపోయినట్లుగా తేల్చారు. చిన్నారుల తల్లి కోటంగారి రంజిత కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. భర్తే హత్య చేసి కుంటలో పడేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

 యువతికి నిప్పంటించిన ఉన్మాది.. హర్షవర్దన్‌ మృతి

Last Updated :Nov 16, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.