ETV Bharat / crime

చెరువు కట్టపై ట్రాక్టర్‌ బోల్తా... ఐదుగురు మృతి

author img

By

Published : May 18, 2022, 3:31 PM IST

Tractor Accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. దూసముద్రం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి.

ట్రాక్టర్‌ బోల్తా
ట్రాక్టర్‌ బోల్తా

Tractor Accident
ఘటనాస్థలి వద్ద మృతుల బంధువుల రోదనలు

Tractor Accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ వద్ద విషాదం చోటుచేసుకుంది. దూసముద్రం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మండలంలోని పర్షా తండాకు చెందిన మొత్తం 9 మంది...పెళ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి ట్రాక్టర్​లో నర్సంపేటకు బయలుదేరారు. చెరువు కట్ట చిన్నదిగా ఉండడం... ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.