ETV Bharat / crime

హైవేపై హోటల్​లో చోరీ.. సీసీ టీవీలో దృశ్యాలు

author img

By

Published : Jan 29, 2023, 10:42 PM IST

thief
దొంగ

Robbery in Hotel: గుంతకల్ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న ఓ హోటల్​లో చోరీ జరిగింది. రాత్రి ఎవరూ లేని సమయంలో వెనుక ద్వారం గుండా హోటల్​లో ప్రవేశించిన దొంగ.. కౌంటర్​లోని 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు.

Robbery in Hotel : అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రధాన రహదారిలో ఉన్న పల్లవి హోటల్​లో చోరీ జరిగింది. వెనుక ద్వారం నుండి దొంగ హోటల్​లోకి చొరబడి.. చోరీకి పాల్పడ్డాడు. కౌంటర్​లో ఉన్న 40 వేల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఉదయాన్నే యజమాని హోటల్ తలుపు తెరిచి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

దొంగతనానికి వచ్చిన దుండగుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.