ETV Bharat / city

మంత్రి అవంతి పేషీలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే?

author img

By

Published : Apr 1, 2022, 2:40 PM IST

conflict between two officers
మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేషిలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ

Conflict Between Two Officers: మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేషీలో ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి తాళాలు వేయడంపై ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది.

Conflict Between Two Officers: సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేషీలోని ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి పేషీ నిర్వహణ విషయంలో పరస్పరం ఘర్షణతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి మంత్రి పేషీకి తాళాలు వేయడంపై ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. కొంతకాలంగా పేషీలోని మంత్రి కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అవంతి బంధువు ఆధీనంలోనే పేషీ నిర్వహణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Lokesh Released Video: జనం చెవిలో జగన్ పూలు.. వీడియో విడుదల చేసిన లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.