తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వైఎస్ షర్మిల గురువారం నిర్వహించనున్న దీక్షకు ఒకరోజు అనుమతి లభించింది. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మూడు రోజుల దీక్షకు షర్మిల ప్రతినిధులు పోలీసులను అనుమతి కోరగా.. రేపు ఒక్కరోజు మాత్రమే దీక్ష నిర్వహించుకునేలా అనుమతించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఖమ్మం సభలో ఆమె ప్రకటించిన మేరకు.. అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి: