ETV Bharat / city

RRR: రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం: ఎంపీ రఘురామ

author img

By

Published : Oct 16, 2021, 4:31 PM IST

రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం
రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం

రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని నర్సాపురం ఎంపీ రఘురామరాజు(RRR NEWS) అన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో 3 గంటలు కరెంట్ కోత విధిస్తున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని నర్సాపురం ఎంపీ రఘురామరాజు(RAGHU RAMRAJU) అన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో 3 గంటలు కరెంట్ కోత విధిస్తున్నారన్న ఆయన.. దిల్లీలో ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టాల గురించే ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

కరెంట్​కు బొగ్గు ఇవ్వలేని వారు... ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు రఘురామ. బొగ్గుపై సీఎం లేఖకు ప్రధాని స్పందించారనేది నిజమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం...విద్యుత్​పై ప్రణాళిక రూపొందించాలని కోరిన ఆయన..మండలిని రద్దు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ ఎంపీగా న్యాయశాఖ మంత్రిని కలిసి కోరతానని రఘురామ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

LOKESH: ఫ్యాన్​కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగింది: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.