ETV Bharat / city

రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేత!

author img

By

Published : May 18, 2022, 4:44 PM IST

పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్
పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్

రాష్ట్రంలోని పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై విధించిన పరిమితులను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో పరిశ్రమలు వినియోగించే విద్యుత్​పై విధించిన పరిమితులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్​కు అనుగుణంగా పరిశ్రమలు ఇవాళ్టి నుంచి విద్యుత్​ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. విద్యుత్ కొరత కారణంగా ఇప్పటి వరకూ 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి మాత్రమే అనుమతించిన డిస్కమ్​లు.. ఇక నుంచి పూర్తిస్థాయిలో వంద శాతం మేర విద్యుత్​ను వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇక నుంచి పరిశ్రమలపై విద్యుత్ పరిమితులు ఏమీ ఉండబోవని ఏపీ ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్​లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తాయని ప్రభుత్వం తెలియచేసింది.

ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేసింది. 50 శాతం విద్యుత్ వినియోగాన్ని 70 శాతానికి పెంచారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గటం, బహిరంగ మార్కెట్​లో విద్యుత్ అందుబాటులోకి రావటంతో పరిశ్రమలకు పూర్తిస్థాయి విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు పెరుగుతున్నట్లు ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఏపీ జెన్​కో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు టెండర్లు పిలిచిందని మొత్తం 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు ఇంధనశాఖ తెలియచేసింది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.