ETV Bharat / city

తెలంగాణలో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని !

author img

By

Published : Jul 7, 2022, 9:21 AM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చినకంజర్ల శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

తెలంగాణలో కోడి పందేలు
తెలంగాణలో కోడి పందేలు

తెలంగాణలో కోడి పందేలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. చిన్నకంజర్ల శివారులో కోడి పందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు.

21 మందిని పట్టుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.

చిన్నకంజర్ల శివారులో కోడి పందేలు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు జరిపాం. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నాం. రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారు. అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారు.-భీమ్​రెడ్డి, పటాన్​చెరు డీఎస్పీ

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.