ETV Bharat / city

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్​

author img

By

Published : Jun 5, 2020, 5:55 AM IST

godavari-river-ownership-board-meeting-at-hyderabad
godavari-river-ownership-board-meeting-at-hyderabad

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్​లో సమావేశం కానుంది. ప్రాజెక్టుల డీపీఆర్​లు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు, ఇతర సభ్యులు హాజరుకానున్నారు.

ఫిర్యాదులు అందిన ప్రాజెక్టుల డీపీఆర్​లు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖల కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లు, ఇతర సభ్యులు పాల్గొంటారు.

అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, గోదావరి మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకుల గూడెం ఆనకట్ట, తాగునీటి సరఫరా ప్రాజెక్టు సహా పెన్​గంగపై ఆనకట్టలు, రామప్ప-పాకాల మళ్లింపు పథకాలను చేపట్టిందని ఏపీ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులతోపాటు గతంలో రెండు రాష్ట్రాలు లేవనెత్తిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​ల విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, గోదావరి బేసిన్​లో టెలిమెట్రీ ఏర్పాటు సహా ఇతర పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా భేటీలో చర్చ జరగనుంది.

ఇదీ చూడండి : సాంకేతిక అనుమతులు లేనివన్నీ.. కొత్తవే: కృష్ణా బోర్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.