ETV Bharat / city

ఉద్యోగుల నియామకంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఉద్యోగులు

author img

By

Published : Mar 28, 2022, 10:19 PM IST

endowment employees press meet
దేవాదాయశాఖ ఉద్యోగుల మీడియా సమావేశం

Endowment Employees: దేవాదాయశాఖలో తక్షణమే పోస్టుల భర్తీతోపాటు పదోన్నతులు కల్పించాలని ఆ శాఖ మూడవ శ్రేణి కార్యనిర్వహణ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శాఖలో అధికారుల నియామకంపై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.

దేవాదాయశాఖలో మూడవ శ్రేణి కార్యనిర్వహణ అధికారుల నియామకంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొన్నారు. అలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మోద్దని.. వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు దేవాదాయశాఖ 3వ శ్రేణి ఉద్యోగులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు కోసం మేము ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. తప్పుడు ప్రచారం చేస్తూ మమ్ముల్ని మానసిక క్షోభకు గురిచేయోద్దని దేవాదాయశాఖ ఉద్యోగుల అసోషియేషన్​ తరపున కోరారు.

3వ శ్రేణి కార్యనిర్వహణ అధికారుల నియామకాలు చేపట్టొదంటూ.. వేసిన పిటిషన్​ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో తక్షణమే పోస్టుల భర్తీతో పాటు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క కార్యనిర్వాహణాధికారి.. సుమారు 30 ఏళ్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

ఇదీ చదవండి: ABV: 'వారిపై పరువు నష్టం దావా వేస్తా.. అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.