ETV Bharat / city

Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 5 లక్షల కొవిడ్ టీకా డోసులు

author img

By

Published : Aug 11, 2021, 9:05 PM IST

పుణె సీరం సంస్థ నుంచి రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వాటిని తరలించారు.

covid vaccine doses reached to ap
రాష్ట్రానికి చేరుకున్న మరో 5 లక్షల కొవిడ్ టీకా డోసులు

రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. అక్కడినుంచి టీకా నిల్వ కేంద్రానికి డోసులను అధికారులు తరలించారు.

వ్యాక్సినేషన్​లో వారికి ప్రాధాన్యం

ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షించిన సీఎం.. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకొని వ్యాక్సిన్​ వేయాలని ఆదేశించారు. అప్పుడే టీకా వృథాను మరింత సమర్థంగా అరికట్టవచ్చన్నారు. 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.