ETV Bharat / city

CBN On YSRCP Govt: వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోంది: చంద్రబాబు

author img

By

Published : Dec 21, 2021, 5:41 PM IST

వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోంది
వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోంది

Chandrababu Participate In Semi Xmas celebrations: శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెబుతోందని..అలాంటిది సొంత పార్టీ కార్యకర్తల్నీ కనికరించని స్థితిలో వైకాపా ఉందన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. ఎన్డీఆర్ భవన్​లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన..ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభు ఆమోదిస్తారా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోంది

Chandrababu Participate In Semi Xmas celebrations: శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెప్తుంటే..సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైకాపా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభు ఆమోదిస్తారా ? అని ఆయన నిలదీశారు. ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపివేసిన ఏకైక ప్రభుత్వం వైకాపానే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్​కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో ఇప్పుడు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశం ఉన్నంత వరకూ మతసామరస్యాన్ని కాపాడతామన్న చంద్రబాబు.., చర్చిలకు తొలిసారి ఆర్ధిక సాయం చేయటంతో పాటు పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు నిధులు, క్రిస్మస్ కానుక లాంటి ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోందన్న చంద్రబాబు..ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలకు శ్రీకారం చుట్టింది తమ పార్టీనేని స్పష్టం చేశారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి..

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేజిక్కించుకున్న జగన్..ఉపకారాన్ని మరిచి ప్రజలకు అపకారం చేస్తున్నారని ఆక్షేపించారు.

క్రైస్తవుల సంక్షేమాన్ని విస్మరించారు..

బైబిల్​ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసిన ఏకక వ్యక్తి జగన్​ అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. క్రైస్తవ ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వ దమనకాండలో మోసపోయిన వారంతా వాస్తవాలు గ్రహించాలన్నారు.

ఇదీ చదవండి CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.