ETV Bharat / city

Shrinking Houses in Tirupati: తిరుపతిలో కుంగుతున్న ఇళ్ల పునాదులు.. వణికిపోతున్న ప్రజలు

author img

By

Published : Nov 27, 2021, 7:04 PM IST

తిరుపతి నగరవాసుల్లో కొత్త టెన్షన్ నెలకొంది. వరద ధాటికి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి.. ఇళ్లు బీటలు వారటం(Shrinking Houses in Tirupati) ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీకృష్ణా నగర్‌ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు(Cracks in houses in Tirupati) వారాయి. రంగంలోకి దిగిన అధికారులు.. చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు.

Shrinking Houses in Tirupati
Shrinking Houses in Tirupati

తిరుపతిలో కుంగుతున్న ఇళ్ల పునాదులు

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరద నీరు ముంచెత్తడంతో తిరుపతి(heavy rain in tirupati) శ్రీకృష్ణనగర్ లోని ఇళ్ల గోడలకు బీటలు(Cracks in houses in Tirupati) బారుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు రోజులు తరబడి కాలనీలలో నిల్వ ఉండటంతో పునాదులు(Shrinking Houses in Tirupati) కుంగుతున్నాయి.

శ్రీకృష్ణ నగర్ లోని 8వ క్రాస్ లో 18 ఇళ్లకు గోడలు పగుల్లిచ్చాయి. మూడంతస్తుల భవనం గోడలు బీటలు బారడంతో కూలిపోయే స్థితికి చేరింది. బీటలు బారిన భవనం సమీపంలోని ఇళ్ల పై పడేందుకు అవకాశం ఉండటంతో ఆ భవనాన్ని కూల్చేందుకు నగరపాలక అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు నిల్వ ఉండటంతో పాటు బలహీనమైన నిర్మాణాలతో భవనాలు కూలిపోయే పరిస్ధితి నెలకొందని అధికారులు తెలిపారు. శ్రీకృష్ణనగర్​లో ఇళ్ల గోడలు పగుళ్ళు వచ్చిన ప్రాంతాన్ని శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు తెదేపా నేతలు పరిశీలించారు. వరదతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని కరుణాకర్ రెడ్డి తెలిపారు.

భూమి నుంచి నీటి ట్యాంక్..
శుక్రవారం తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో ఓ వింత చోటుచేసుకుంది. భూమి లోపల పాతిపెట్టిన నీటి ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా భూమి ఉపరితలం పైకి ఎగసి(TANK RAISED FROM GROUND IN TIRUPATI) వచ్చింది. దాదాపు 25 అడుగుల విస్తీర్ణంతో 25 సిమెంట్ ఒరలతో నిర్మించిన నీటి తొట్టె బయటపడటం ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శుభ్రం చేస్తున్న సమయంలో సిమెంటు ఒరలు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన మహిళ నీటి తొట్టెలో పడిపోయారు. వెంటనే ఆమెను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నీరు ప్రవహించడంతో ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు ఒరలు 18 పైకి ఊబికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇళ్లకు బీటలు మారటం.. ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి

TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.