ETV Bharat / city

కర్నూలులో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

author img

By

Published : Aug 31, 2020, 5:08 AM IST

Ganesha immersion ended peacefully in Kurnool
కర్నూలులో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

కర్నూలులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ప్రతిసారి 15 వందల నుంచి 2 వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా రెండు నుంచి ఐదు అడుగుల విగ్రహాలను వందలోపే ఏర్పాటు చేశారు.

కర్నూలులో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

కర్నూలులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను... వినాయక ఘాట్ వద్దనున్న కే.సీ.కాలువలో నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం 1500 విగ్రహాల నుంచి రెండు వేల వరకు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా రెండు నుంచి ఐదు అడుగుల విగ్రహాలను వందలోపు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా వేద పండితులు గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.