ETV Bharat / city

'న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబాన్ని లాగడం సరికాదు'

author img

By

Published : Oct 30, 2020, 7:22 PM IST

bhuma akhila priya
భూమా అఖిలప్రియ

నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందనడం సబబు కాదని.. మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి వాటిని నిరూపించగలరా అని సవాల్ విసిరారు.

కర్నూలు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా భూమా కుటుంబాన్ని నిందించడం అందరికీ అలవాటైందని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది సుబ్బారాయుడు హత్యలో తమ హస్తం ఉన్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఈ కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందనడం ఎంతవరకు సబబని నిలదీశారు. వారం రోజుల్లో తను చేసిన ఆరోపణలను నిరూపించగలరా అని సవాల్ విసిరారు.

ఇవీ చదవండి..

మర్రిమేకలపల్లిలో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.