ETV Bharat / city

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'

author img

By

Published : Mar 13, 2021, 6:36 PM IST

ap mlc elections
ap mlc elections

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు.

నాలుగు జిల్లాల్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ స్పష్టం చేశారు. కృష్ణా-గుంటూరు, పశ్చిమ-తూర్పుగోదావరి జిల్లాల పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ప్రతీ మండల కేంద్రంలోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు అయ్యిందని.. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. కృష్ణా- గుంటూరు జిల్లాలకు ఒక ఎన్నికల పరిశీలకుడు, పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాలకు మరో ఎన్నికల పరిశీలకుడ్ని నియమించినట్టు వివరించారు.

ఇదీ చదవండి

కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.