ETV Bharat / city

Restrictions on Maha Padayatra: మహాపాదయాత్రకు వైకాపా నేతల అడ్డంకులు.. రోడ్డుపైనే రైతుల భోజనం

author img

By

Published : Dec 1, 2021, 6:23 PM IST

Restrictions on Maha Padayatra
మహాపాదయాత్రకు వైకాపా నేతల అడ్డంకులు.. రోడ్డుపైనే రైతుల భోజనం

Restrictions on Amravati Maha Padayatra: నెల్లూరు జిల్లాలో 31వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు స్థానిక వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారు. రైతులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు స్థలం లేకుండా చేశారు. దీంతో రైతులు రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు.

మహాపాదయాత్రకు వైకాపా నేతల అడ్డంకులు.. రోడ్డుపైనే రైతుల భోజనం

Restrictions on Amravati Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 31వ రోజు.. నెల్లూరు జిల్లాలో ఆంక్షలు, అడ్డంకుల మధ్య కొనసాగుతోంది. పాదయాత్రకు స్థానిక వైకాపా నేతలు అడ్డంకులు సృష్టిస్తుంచారు. రైతులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఎక్కడా స్థలం లేకుండా చేశారు. దీంతో రైతులు చాటగుంట్ల గ్రామం వద్ద భోజన వాహనాలను ఆపి రోడ్డుపైనే కూర్చుని భోజనం చేశారు.

మహిళలకు మొబైల్ టాయిలెట్స్ వాహనాలు కూడా లేకుండా చేశారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్రను ఆపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇకనైనా సీఎం జగన్​ బుద్ధి మారాలని తిరుమల శ్రీవారిని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి..: amaravathi farmers padayatra in nellore: ప్రచార రథాలను అడ్డుకున్న పోలీసులు..రోడ్డుపై అమరావతి రైతుల బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.