ETV Bharat / city

RP Patnaik : హత్యాచార నిందితున్ని పట్టిస్తే.. నేనూ రివార్డిస్తా...

author img

By

Published : Sep 15, 2021, 2:10 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని సైదాబాద్​ ప్రాంతంలో జరిగిన హత్యాచార ఘటనపై యావత్​ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం, విచారం వ్యక్తం అవుతోంది. ఘటనకు పాల్పడిన రాజును అరెస్టు చేసి.. కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాజుని పట్టిస్తే తన వంతుగా రూ. 50వేలు రివార్డు అందిస్తానని సంగీత దర్శకుడు ఆర్​పీ పట్నాయక్​ ప్రకటించారు. ఆ మానవ మృగాన్ని పట్టుకోవడంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

RP Patnaik
హత్యాచార నిందితున్ని పట్టిస్తే.. నేనూ రివార్డిస్తా...

తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని సైదాబాద్​ ప్రాంతంలో జరిగిన హత్యాచార ఘటనపై యావత్​ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం, విచారం వ్యక్తం అవుతోంది. సైదాబాద్​ హత్యాచార ఘటనలో చిన్నారికి న్యాయం జరగాలన్నా.. ఆమె ఆత్మ శాంతించాలన్నా.. నిందితుడు పల్లకొండ రాజు దొరకాలని సంగీత దర్శకుడు ఆర్​పీ పట్నాయక్​ ఆకాంక్షించారు. హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసిన ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి రూ. 10 లక్షలు రివార్డు ప్రకటించిందని చెప్పారు. ఈ క్రమంలో తన వంతుగా రాజును పట్టించిన వారికి రూ. 50,000 ఇస్తానని వెల్లడించారు.

నిందితుడు దొరకాలని... పోలీసులు ఇచ్చిన అన్ని ఆధారాలతో మనం అతడిని పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చని ఆర్​పీ పేర్కొన్నారు. కానీ చేతిపై "మౌనిక' అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతను మనకు దగ్గర్లోనే ఉండొచ్చని.. నిఘా వేసి ఉంచాలని సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు శాఖకి సహకరించాలని కోరారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: Saidabad rape case: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే రూ. 10 లక్షలు

Saidabad Rape Case: సైదాబాద్ హత్యాచారం కేసును నేరుగా పర్యవేక్షిస్తున్న డీజీపీ

saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?

Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.