ETV Bharat / city

విగ్రహ ధ్వంసం ఘటనపై విచారణ వేగవంతం చేయండి: మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Dec 29, 2020, 10:57 PM IST

minister vellampalli srinivas
minister vellamminister vellampalli srinivas palli srinivas

విజయనగరం జిల్లా రామతీర్ధంలో విగ్రహ ధ్వంసంపై మంత్రి వెల్లంపల్లి ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించేందుకు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు.

విజయనగరం జిల్లాలో విగ్రహం ధ్వంసం ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫోన్​లో జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై విచారణాధికారిని నియమించాలని దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు విచారణ అధికారిగా మల్టీ జోన్-2 ఆర్‌.జె.సి భ్రమరాంబను నియామించారు.

ఇదీ చదవండి

గున్న ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహంతో వ్యక్తిని తొక్కేసిన గజరాజు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.