ETV Bharat / city

Cyber crime: ఎమ్మెల్యే అకౌంట్​నే టార్గెట్ చేశారు..!

author img

By

Published : Nov 25, 2021, 4:12 PM IST

Cyber crime
Cyber crime

ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ప్రజాప్రతినిధులను సైతం టార్గెట్ చేస్తున్నారు. తాజాగా.. తెలంగాణలోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచారు. ఇతరులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి.. తమ దందా షురూ చేశారు.

ఫేసు బుక్​లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు.. తెలిసిన వారిలా అనిపించి యాక్సెప్ట్ చేస్తే ఖతం.. వెంటనే ఇన్ బాక్స్ లో మెసేజ్ చేస్తారు.. ఎలా ఉన్నావ్? ఎక్కడున్నావ్? అని అడిగేసి.. అర్జెంటుగా డబ్బులు కావాలని, రేపే ఇచ్చేస్తానని అంటారు. మొబైల్ నంబర్ కూడా పంపిస్తారు. ఇదే తీరున.. తెలంగాణలోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( fake Facebook create on Kukatpally MLA) పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి.. డబ్బులు వసూళ్లు మొదలు పెట్టారు సైబర్ నేరగాళ్లు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు(Kukatpally MLA complaint against cyber criminals) చేపట్టారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడెక్కడో ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మాధవరం కృష్ణారావు అన్నారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేస్​బుక్ ఖాతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇదీ చదవండి: Lockup death: పెచ్చరిల్లుతున్న పోలీసు హింస... లాకప్‌ మరణాలకు అంతం లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.