ETV Bharat / city

Corona Cases in TS Schools: పాఠశాలల్లో కరోనా కలవరం.. ఐదుగురికి పాజిటివ్

author img

By

Published : Sep 3, 2021, 6:46 PM IST

Corona Cases in Schools
Corona Cases in Schools

తెలంగాణ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. ములుగు, నిజామాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అయిదు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పిల్లలను బడికి పంపేందుకే తల్లిదండ్రులు జంకుతున్నారు.

పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే కరోనా(corona) కేసులు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు(covid cases) బయటపడ్డాయి. ములుగు జిల్లా(mulugu district) ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. గురువారం విధులకు హాజరైన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. మిగతా ఉపాధ్యాయులు పరీక్ష చేయించుకోగా.. వారికి నెగిటివ్‌గా తెలింది.

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ పాఠశాలలోనూ ఓ విద్యార్థిని, అటెండర్‌కు కరోనా సోకింది. విద్యార్థిని తండ్రికి కూడా పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పాఠశాలలోని 75 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో ఎంఈవో ఆంద్రయ్య, వైద్యాధికారులు పాఠశాలను సందర్శించారు. కొవిడ్ భయంతో పాఠశాలకు ఐదుగురు విద్యార్థులే హాజరయ్యారు. భయం భయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతున్న వేళ... కరోనా కేసులు బయటపడుతుండటం కలకలం సృష్టిస్తోంది.

ఇదీ చదవండి:

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,520 కరోనా కేసులు.. 10 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.