ETV Bharat / city

54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు... సర్వేలో తేల్చిన సీసీఎంబీ

author img

By

Published : Mar 4, 2021, 7:56 PM IST

Covid antibodies
కొవిడ్‌ యాంటీబాడీలు

తెలంగాణ రాజధాని నగరంలోని 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు సీసీఎంబీ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌, ఎన్​ఐఎన్​తో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడైనట్లు తెలిపింది.

హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని సీసీఎంబీ ప్రకటించింది. 56 శాతం స్త్రీలు, 53 శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75 శాతం మందికి కరోనా వచ్చినట్టు తెలియలేదన్న శాస్త్రవేత్తలు... 30 వార్డుల్లో 9వేల మంది నమూనాలు పరిశీలించామన్నారు. భారత్‌ బయోటెక్‌, ఎన్​ఐఎన్​తో కలిసి సీరో సర్వే చేశామని సీసీఎంబీ వెల్లడించింది.

ఇదీ చదవండి: అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన గవర్నర్‌ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.