ETV Bharat / city

Telugu Academy case: నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు.. నిధుల మళ్లింపుపై ఆరా

author img

By

Published : Dec 3, 2021, 8:41 PM IST

Updated : Dec 3, 2021, 11:54 PM IST

నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు
నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు

Telugu Academy: తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల నిధులను ఎక్కడికి మళ్లించారనే దానిపైనే ఆరా తీస్తున్నారు.

Telugu Academy: తెలుగు అకాడమీ కేసు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్​ గూడ జైల్లో ఉన్న ఆరుగురు నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించగా.. ఇవాళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Accused into custody: చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సాయి కుమార్, వెంకట రమణ, సోమశేఖర్, వెంకట్, రమేశ్, సత్యనారాయణలను సీసీఎస్​కు తరలించి ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలను వాటాలుగా పంచుకున్న నిందితులు.. వాటిని ఎక్కడికి మళ్లించారనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఆస్తుల జప్తు

CCS police: ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలకు లెక్క తేలకపోవడంతో డిపాజిట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నిందితులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వీళ్లందరూ డబ్బులను వాటాలుగా పంచుకొని పలుచోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిధుల మళ్లింపుపై ఆరా

ccs custody: రెండు రోజుల పాటు నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు సీసీఎస్ పోలీసులు యత్నిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి యూనియన్, కెనరా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఆ తర్వాత నగదును విడతల వారీగా విత్ డ్రా చేసుకొని వాటాలు పంచుకున్నారు.

ఇదీ చూడండి:

Weather Update: ముంచుకొస్తున్న 'జవాద్' ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

Last Updated :Dec 3, 2021, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.