ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Aug 9, 2022, 9:00 PM IST

TOP NEWS
TOP NEWS

.

  • గిరిజనులకు గోరంత ఇచ్చి కొండంత దోచేస్తున్నారు: చంద్రబాబు
    బాక్సైట్ తవ్వకాలు చేపట్టి అటవీ సంపదను ముఖ్యమంత్రి జగన్ దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గిరిజనులకు జగన్‌ గోరంత ఇచ్చి కొండంత దోచేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గిరిజనుల సంక్షేమానికి తాము తెచ్చిన పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మాధవ్​పై చర్యలకు మహిళా నేతల డిమాండ్‌.. డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
    ఎంపీ గోరంట్ల మాధవ్​పై చర్యలకు డిమాండ్ చేస్తూ అఖిల పక్షాల మహిళా నేతలు ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా నేతలను డీజీపీ కార్యాలయం బయటే పోలీసులు అడ్డుకున్నారు. పబ్లిక్ హాలీడే కావడంతో అధికారులెవరూ లేరని..,తర్వాత రావాలని పోలీసులు సూచించటంతో మహిళా నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వెంకయ్య మాటలు స్ఫూర్తినిస్తాయి : పవన్ కల్యాణ్
    ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాటలు స్ఫూర్తినిస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు సంపాదించిన వెంకయ్య.. పార్టీ పదవి అయినా.. రాజ్యాంగ పదవి అయినా.. ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రతి పౌరుడిలో జాతీయతా భావం.. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా: సోము వీర్రాజు
    ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి కొత్త వంతెన సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భాజపా తరపున ఏపీలో 15 లక్షల ఇళ్లపై జెండాలు ఎగరేసేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భాజపాకు నితీశ్​ గుడ్​బై.. సీఎం పదవికి రాజీనామా.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో కలిసి కొత్త ప్రభుత్వం
    రాజకీయ పునరేకీకరణతో బిహార్​ పాలిటిక్స్ మరోసారి కీలక మలుపు తిరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న భాజపాకు రెండోసారి షాక్ ఇస్తూ.. ఎన్​డీఏ నుంచి బయటకు వచ్చేసింది జేడీయూ. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారీగా పెరిగిన మోదీ ఆస్తులు.. ఆ భూమిని దానం చేసిన ప్రధాని!
    భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. ఎంత ఆస్తులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈసారి మరి మోదీ ఆస్తుల విలువ​ ఎంత పెరిగిందో తెలుసా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?
    అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొత్త రూల్స్​తో చెక్కులకు అదనపు భద్రత
    డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా ఇప్పుడు పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. దీంతో చెక్కులకు మరింత అదనపు భద్రత లభిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇన్​స్టా పోస్టులన్నీ డిలీట్​ చేసిన రానా.. ట్విట్టర్​లో ప్రకటన.. ఆ కారణంతో..
    టాలీవుడ్​ నటుడు రానా దగ్గుబాటి తన ఇన్​స్టాగ్రామ్​ పోస్టులన్నింటినీ డిలీట్​ చేశారు. ఒక్కటి కూడా ఉంచలేదు. కారణమేంటంటే ? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • టీ-20ల్లో నయా సంచలనం.. అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్​లో దూకుడు
    కామన్వెల్త్​ గేమ్స్​లో టీమ్​ఇండియా ఆద్యంతం రాణించినా.. ఫైనల్లో చతికిలపడింది. రజతంతో సరిపెట్టుకుంది. అయితే.. భారత మహిళల జట్టులో ఓ ప్లేయర్​ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెనే రేణుకా సింగ్​ ఠాకుర్​. ఆ టోర్నీలో లీడింగ్​ వికెట్​ టేకర్​గా నిలిచిన ఆమె.. ఇప్పుడు టీ-20 ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.