- ద్రౌపదీ ముర్ము ఘన విజయం.. రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్న తొలి ఆదివాసీ మహిళ
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈనెల 25న ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.
- అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. మంత్రి, గవర్నర్గా ఉన్నత సేవలు అందించిన ఆమె తదుపరి రాష్ట్రపతిగా సేవలు అందించనున్నారు.
- పోలవరాన్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు
దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రంగా ఏపీని మార్చేశారని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిపై ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని మండిపడ్డారు.
- ఆదాయాన్ని ఖజానాలో జమచేయకుండా.. కార్పొరేషన్కు మళ్లించడం చట్టవిరుద్ధం:ఎంపీ రఘురామ
MP RRR: మద్యంపై వచ్చే ఆదాయాన్ని.. ఖజానాలో జమచేయకుండా కార్పొరేషన్కు మళ్లించడం చట్టవిరుద్ధమని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఇదే అంశాన్ని ఆయన లోక్సభలో ప్రస్తావించారు.
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు: రాజధాని రైతులు
సీఆర్డీఏ అధికారులతో అమరావతి జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరిస్తామని సీఆర్డీఏ కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు.
- 'ఏపీ గురించే మాట్లాడే ముందు మీ అప్పుల గురించి ప్రసావించండి'
ఏపీ అప్పుల గురించి ప్రస్తావించే ముందు కేంద్రం తన అప్పుల గురించి కూడా ప్రస్తావించాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. 2019-20లో కేంద్ర రుణాలు జీడీపీలో 50.90 శాతంగా ఉన్నాయన్నారు. ఏపీ అప్పులను 2021-22 నాటికి 25,194 కోట్లకు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు.
- అమెరికా అధ్యక్షుడు బైడెన్కు కరోనా పాజిటివ్
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బారిన పడ్డ బైడెన్కు స్వల్పంగానే వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
- భారీ కటౌట్స్, డ్యాన్స్లు.. ట్రైలర్ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్' ఫ్యాన్స్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్ ఫాన్స్ కేక పుట్టించారు. భారీ కటౌట్స్, డ్యాన్స్లతో అదరగొట్టారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- 'వన్డే క్రికెట్ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'
ఇకపై అంతర్జాతీయ షెడ్యూల్లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని సూచించాడు దిగ్గజ బౌలర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ అంతరించే స్థాయికి చేరుకుందని తెలిపాడు.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM
ఏపీ ప్రధాన వార్తలు
- ద్రౌపదీ ముర్ము ఘన విజయం.. రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్న తొలి ఆదివాసీ మహిళ
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈనెల 25న ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.
- అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. మంత్రి, గవర్నర్గా ఉన్నత సేవలు అందించిన ఆమె తదుపరి రాష్ట్రపతిగా సేవలు అందించనున్నారు.
- పోలవరాన్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు
దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రంగా ఏపీని మార్చేశారని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిపై ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని మండిపడ్డారు.
- ఆదాయాన్ని ఖజానాలో జమచేయకుండా.. కార్పొరేషన్కు మళ్లించడం చట్టవిరుద్ధం:ఎంపీ రఘురామ
MP RRR: మద్యంపై వచ్చే ఆదాయాన్ని.. ఖజానాలో జమచేయకుండా కార్పొరేషన్కు మళ్లించడం చట్టవిరుద్ధమని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఇదే అంశాన్ని ఆయన లోక్సభలో ప్రస్తావించారు.
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు: రాజధాని రైతులు
సీఆర్డీఏ అధికారులతో అమరావతి జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరిస్తామని సీఆర్డీఏ కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు.
- 'ఏపీ గురించే మాట్లాడే ముందు మీ అప్పుల గురించి ప్రసావించండి'
ఏపీ అప్పుల గురించి ప్రస్తావించే ముందు కేంద్రం తన అప్పుల గురించి కూడా ప్రస్తావించాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. 2019-20లో కేంద్ర రుణాలు జీడీపీలో 50.90 శాతంగా ఉన్నాయన్నారు. ఏపీ అప్పులను 2021-22 నాటికి 25,194 కోట్లకు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు.
- అమెరికా అధ్యక్షుడు బైడెన్కు కరోనా పాజిటివ్
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బారిన పడ్డ బైడెన్కు స్వల్పంగానే వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
- భారీ కటౌట్స్, డ్యాన్స్లు.. ట్రైలర్ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్' ఫ్యాన్స్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్ ఫాన్స్ కేక పుట్టించారు. భారీ కటౌట్స్, డ్యాన్స్లతో అదరగొట్టారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- 'వన్డే క్రికెట్ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'
ఇకపై అంతర్జాతీయ షెడ్యూల్లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని సూచించాడు దిగ్గజ బౌలర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ అంతరించే స్థాయికి చేరుకుందని తెలిపాడు.