ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Apr 12, 2022, 4:59 PM IST

ప్రధాన వార్తలు @5PM
ap 5pm top news

.

  • ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు: సీఎం జగన్
    వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాధ్యతలు చేపట్టిన నూతన మంత్రులు..
    నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొందరు నాయకులు నేడు సచివాలయంలో వారికి సంబంధించిన శాఖలకు బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్'
    ముఖ్యమంత్రి కేబినెట్​పై తెదేపా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవసరమైతే రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ
    అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకుంఠం-2 కంపార్టుమెంట్లను సిద్ధం చేస్తున్న తితిదే
    రెండేళ్లకుపైగా తిరుమల వైకుంఠం-2ను మూసివేసిన తితిదే.. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ తెరవడానికి సిద్ధమైంది. ఈమేరకు తితిదే సిబ్బంది వైకుంఠం-2లోని కంపార్టుమెంట్లను శుద్ధి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ మృతి
    ఝార్ఖండ్​ త్రికూట పర్వతాల్లో జరిగిన రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. 40 గంటల పాటు సాగిన సహాయక చర్యలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆత్మవిశ్వాసమే అందం'.. దివ్యాంగుల ఫ్యాషన్​ షో అదుర్స్!
    దివ్యాంగుల ఫ్యాషన్​ షో.. తమిళనాడు కోయంబత్తూర్​లో అట్టహాసంగా సాగింది. 50 మంది పారా అథ్లెట్లు, మరికొందరు మోడళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని.. వీల్ ఛైర్ల సాయంతో ర్యాంప్ వాక్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కారు డ్రైవర్ దారుణం.. వృద్ధుడిని ఢీకొట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
    ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. అనంతరం తనతో గొడవకు దిగిన వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. బిహార్​ పట్నాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోహ్లీకి ఆ విషయం చెప్పి.. చెన్నైని డుప్లెసిస్ దెబ్బతీస్తాడా?
    ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై, ఆర్సీబీ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. వీడియో వైరల్​!
    బాలీవుడ్​ సీనియర్​ నటి కత్రినా కైఫ్.. తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్​ అంటూ.. సోషల్​ మీడియా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.