ETV Bharat / city

అవసరమైతే రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ

author img

By

Published : Apr 12, 2022, 4:38 PM IST

CPI Dharna: అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CPI State Bundh
CPI State Bundh

CPI State Bundh: అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శ కె. రామకృష్ణ తెలిపారు. 15వ తేదీన పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, అవసరమైతే రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తామని ఆయన వెల్లడించారు. పెరిగిపోతున్న ధరలను వ్యతిరేకిస్తూ ప్రచార కార్యక్రమాన్ని వాడవాడలా తాము నిర్వహిస్తున్నామని వివరించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో రామకృష్ణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'.. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.