ETV Bharat / city

స్పష్టత వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తాం: అమరావతి రైతులు

author img

By

Published : Sep 18, 2020, 8:44 PM IST

స్పష్టత వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తాం
స్పష్టత వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తాం

అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకూ దీక్షలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి మద్దతుగా 276వ రోజు దీక్షలు కొనసాగించారు.

రాజధాని అమరావతిలో రైతులు...276వ రోజు తమ దీక్షలను కొనసాగించారు. తుళ్లూరు, అనంతవరం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాల వద్ద నిరసనను తెలియజేశారు. రాయపూడిలో కళ్లకు గంతలు కట్టుకొని అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంతవరకు దీక్షలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ఇదీచదవండి

16 నెలల వైకాపా అవినీతి పాలనపై సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.