ETV Bharat / city

SUICIDE ATTEMPT: పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 14, 2021, 7:28 PM IST

పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం
పోడు సమస్య..అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సమస్య రగులుతూనే ఉంది. ఖమ్మం ఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలంలో అటవీ అధికారుల తీరుతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన రైతు భూక్య హుస్సేన్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను సాగు చేసుకుంటున్న భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు.

పాండురంగాపురం గ్రామానికి చెందిన భూక్య హుస్సేన్ బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో గల సర్వే నెంబర్​ 90లో 10 ఎకరాల భూమిని చాలా కాలం నుంచి సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ భూమి విషయంలో భూక్య హుస్సేన్​కు, అటవీ అధికారులకు మధ్య గతంలో వివాదం తలెత్తగా.. భూక్య హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు హైకోర్టులోనే ఉంది.

ఇదిలా ఉండగా.. నేడు అటవీ శాఖ అధికారులు ఆ భూమిలో జామాయిల్​ మొక్కలు నాటేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న భూక్య అక్కడికి చేరుకున్నాడు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు ఉందని.. మొక్కలు నాటొద్దని అధికారులను కోరాడు.

భూక్య హుస్సేన్​ మాటలు పట్టించుకోని అటవీ అధికారులు.. భూమిలో మొక్కలు నాటారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో పాల్పంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు ఉదయ్​కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.