ETV Bharat / state

VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు ఉదయ్​కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి హాజరు

author img

By

Published : Aug 14, 2021, 11:51 AM IST

Updated : Aug 14, 2021, 7:47 PM IST

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విచారణకు తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు.

69వ రోజు సీబీఐ విచారణకు
69వ రోజు సీబీఐ విచారణకు

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు విచారణ చేపట్టాయి. పులివెందుల అతిథి గృహంలో సీబీఐ విచారణకు నలుగురు అనుమానితులు హాజరయ్యారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు కాగా ప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్​గా పనిచేస్తున్నాడు.

వీరితో పాటు.. ఉదయ్ కుమార్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న బాబు రెడ్డి దంపతులను కూడా పలు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మరో సీబీఐ బృందం ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ తో పాటు అతని సమీప బంధువు భరత్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. నిన్న వివేకా కుమార్తె సునీత భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేక ఇంటి వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

పోలీసుల అదుపులో మణికంఠరెడ్డి...

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వద్ద రెక్కీ నిర్వహించిన మణికంఠరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద మణికంఠరెడ్డి రెండుసార్లు బైక్ పై వచ్చి కాంపౌండ్ లోపల కూడా తిరిగినట్లు సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇవాళ మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎందుకు ఆ ప్రాంతంలో సంచరించాల్సి వచ్చింది, ఎవరు సూచనల మేరకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపైన మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెక మణికంఠ రెడ్డిని విచారణ చేస్తున్నారు. చివరికి మణికంఠ రెడ్డిపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణానదిలో చిక్కుకున్న లారీలు..కొనసాగుతున్న సహాయక చర్యలు

Last Updated :Aug 14, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.