రాష్ట్రంలో చిన్నారుల్లో దృష్టి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . కంటి వెలుగు పథకంలో భాగంగా తొలివిడత పరీక్షలు చేయించుకున్న 66 లక్షల మంది చిన్నారుల్లో ...4 లక్షల 33 వేల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు తేలింది. మలి విడతలో లక్షా 24 వేల మందికి పరీక్షలు నిర్వహించగా … 60 శాతం చిన్నారులకు కళ్ల జోళ్లు అవసరమని... వీటితో పాటు ఇతర వైద్య సేవలు పొందాలని గణాంకాల ద్వారా వెల్లడైంది. అనంతపురం జిల్లాలో ఏడేళ్ల చిన్నారికి కంటి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు . గత నెలలో కంటి వెలుగు పథకం కింద 60 వేల 694 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కడప, నెల్లూరు , ప్రకాశం , గుంటూరు , కృష్ణా , విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో గరిష్ఠంగా 7 నుంచి 8 శాతం చిన్నారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో 6. 78 శాతం ….తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో 4 నుంచి 5 శాతం పిల్లలకు కంటి లోపాలున్నట్లు తేలింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 నుంచి 6 శాతం మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారు. తొలివిడత పరీక్షల ద్వారా తీవ్రత దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 4 లక్షల 32 వేల మందికి ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే... గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది.
ఇవీ చూడండి: