ETV Bharat / business

ఢమాల్ స్ట్రీట్​.. రూ.7లక్షల కోట్లు ఆవిరి.. రూపాయి పతనంలో నయా రికార్డ్

author img

By

Published : Jun 13, 2022, 3:42 PM IST

Updated : Jun 13, 2022, 3:52 PM IST

stock market crash: అమెరికా ఫెడ్​ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్​ ఏకంగా 1450 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 16వేల దిగువకు చేరింది. సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. మరోవైపు.. రూపాయి తొలిసారి 78 మార్క్​ దాటింది.

stock markets
స్టాక్​ మార్కెట్లు

stock market crash: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడ్​ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. బెంచ్​మార్క్​ సూచీలు దాదాపు 2.5 శాతానికిపైగా పడిపోవటం వల్ల ఒక్కరోజులోనే మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్​ ఏకంగా 1450 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 16వేల దిగువకు చేరింది.

America fed rate news: అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరి 8.6గా నమోదైంది. దీంతో ఫెడరల్​ రిజర్వ్​ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న అనుమానాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత సెషన్​లో బీఎస్​సీ మార్కెట్​ క్యాపిటలైజేషన్​ రూ.251.8 లక్షల కోట్లుగా ఉండగా.. అది సోమవారం మధ్యాహ్నానికి రూ.245 లక్షల కోట్లకు పడిపోయింది. మే 30 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.13.6 లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 1457 పాయింట్ల నష్టంతో.. 52,847 వద్ద స్థిరపడింది.
    ఇంట్రాడేలో సోమవారం 53,185 వద్ద ప్రారంభమైన సూచీ ఆది నుంచే నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు లేవు. ఒకానొక దశలో 52,527 పాయింట్లకు పడిపోయిన సూచీ కాస్త కోలుకుని.. 52,847 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ..427 పాయింట్లు కోల్పోయి..15,774 వద్ద ముగిసింది.
    ఇంట్రాడేలో.. 15,877 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 15,886 పాయింట్ల గరిష్ఠ, 15,684 పాయింట్ల కనిష్ఠ స్థాయులను తాకింది. చివరకు 15,774 పాయింట్ల వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి.. బీఎస్​ఈ 30 ఇండెక్స్​లో కేవలం నెస్లే మాత్రమే లాభాల్లో ముగియగా.. అన్ని సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బజాజ్​ఫిన్​సర్వ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ఫైనాన్స్​, టెక్​మహీంద్ర 5 శాతానికిపైగా నష్టపోయాయి. టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​ 4శాతానికిపైగా, ఎన్​టీపీసీ, ఎస్​బీఐఎన్​, ఎల్​టీ, ఎమ్​అండ్​ ఎమ్​, విప్రోలు 3 శాతానికిపైగా నష్టాల్లో ముగిశాయి.

తొలిసారి 78 మార్క్​ దాటిన రూపాయి rupee depreciation: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. స్టాక్​ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో రూపాయి విలువ డాలర్​తో పోలిస్తే.. 78 దిగువకు చేరింది. చరిత్రలో తొలిసారి 78 మార్క్​ను దాటింది. ఇంటర్​బ్యాంక్​ ఫారెన్​ ఎక్స్చేంజ్​ మార్కెట్​లో సోమవారం 78.14 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత దిగజారి 78.23కు పడిపోయింది. ఇటీవల ముడి చమురు ధరలు పెరగటం సైతం రూపాయి పతనానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్​ క్రూడ్​ ఆయిల్​ ధర బ్యారెల్​కు దాదాపు 120 డాలర్లుగా పలుకుతోంది. చముర ధరలు భారీగా పెరగటం వల్ల వాణిజ్యం లోటు పెరిగి దేశాల కరెన్సీ విలువ పడిపోతుంది.

ఇదీ చూడండి: జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...

అమెజాన్​కు షాక్​.. రూ.202 కోట్ల జరిమానా కట్టాల్సిందే..

Last Updated : Jun 13, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.