స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Jul 13, 2022, 10:50 AM IST

Gold Price Today
Gold Price Today ()

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.120 తగ్గి.. ప్రస్తుతం రూ.52,280 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 370 తగ్గి రూ.57,580వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. కిలో వెండి ధర రూ.57,580 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,280వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,580గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,580 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,580 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,730.5 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.06 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,49,000 పలుకుతోంది. ఇథీరియం రూ.2వేలు పెరిగిపోయింది. ప్రస్తుతం రూ.90వేల వద్ద కొనసాగుతోంది.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.16,49,000
ఇథీరియంరూ.90,450
టెథర్రూ.83.64
బినాన్స్​ కాయిన్రూ.18,724
యూఎస్​డీ కాయిన్రూ.84.71

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు: రెండు వరుస సెషన్లలో నష్టపోయిన స్టాక్​ మార్కెట్లు బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూల పవనాలు వీయడం వల్ల సెన్సెక్స్ 324 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 81 పాయింట్లు ఎగబాకి 16, 139 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.55గా ఉంది. హిందూస్థాన్​ యూనిలివర్, ఏసియన్ పేయింట్స్, బజాజ్​ ఫిన్​సర్వ్, పవర్​గ్రిడ్, ఎల్ అండ్​ టీ లాభాల్లో ఉండగా.. హెచ్​సీఎల్ టెక్నాలజీస్​, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:

గడువులోగా ఐటీఆర్​ ఫైల్​ చేస్తే లాభాలెన్నో!

ఒప్పో, వన్​ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం... కారణం 'నోకియా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.