ETV Bharat / business

ఆగని పెట్రో మంట- నాలుగో రోజూ పెరిగిన ధరలు

author img

By

Published : Oct 3, 2021, 8:36 AM IST

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పరుగులు పెడుతున్నాయి. లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​పై 30 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

PETROL DIESEL PRICES TODAY
పెట్రోల్, డీజిల్ ధరలు

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 25 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.102.39కి చేరగా.. డీజిల్​ ధర రూ.90.78కి పెరిగింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.108.39గా ఉంది. డీజిల్ ధర రూ.98.44కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.47కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 32 పైసలు అధికమై.. లీటర్​కు రూ.99.00కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.40కు చేరుకుంది. డీజిల్​పై 32 పైసలు పెరిగి.. రూ.99.42కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 26 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.108.67గా ఉంది. డీజిల్​ లీటర్​కు 32 పైసలు పెరిగి.. రూ.100.65 వద్ద ఉంది.

ఇదీ చూడండి: దసరా వచ్చేస్తోంది.. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.