పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? రూ.10 వేలు ఫైన్​ ఖాయం!

author img

By

Published : Sep 13, 2021, 1:53 PM IST

Aadhar, Pan

ఆధార్​తో పాన్​ లింక్​ (Pan Aadhar link) తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎస్​బీఐ కీలక సూచనలు చేసింది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం రావద్దంటే.. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ (Pan Aadhaar link last date) అని గుర్తు చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఖాతాదారులు ఎవరైనా ఇంకా పాన్-ఆధార్​ అనుసంధానం (Pan Aadhar link) చేయకపోతే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్​ 30 చివరి తేదీ (Pan Aadhaar link last date) అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం రావద్దంటే.. ఈ పనిని పూర్తి చేయడం తప్పనిసరని పేర్కొంది.

పాన్-ఆధార్​​ అనుసంధానానికి సెప్టెంబర్​ 30ని తుది గడువుగా ప్రభుత్వమే నిర్ణయించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్​బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.

ఆధార్​తో పాన్ లింక్ ఎలా? (How to link Pan with Aadhar)..

  • కొత్త ఇన్​కం ట్యాక్స్ పోర్టల్​ను ఓపెన్​ చేయాలి (Pan link with Aadhar online).
  • అవసర్ సర్వీసెస్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.. అక్కడ మీకు పాన్-ఆధార్ లింక్ ఫారం కనిపిస్తుంది.
  • అందులో.. ఆధార్​, పాన్ వివరాలు నింపాలి.
  • తర్వాత మొబైల్ నంబర్​ ఎంటర్​ చేయాలి.
  • ఆధార్ వెరిఫికేషన్​కు పేజీలో.. I agree to validate my Aadhaar details అనే ఆప్షన్​ను టిక్ చేయాలి.
  • ఆ తర్వాత లింక్ ఆధార్​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే సరిపోతుంది.

ఎస్​ఎంఎస్​ ద్వారా..

మీ మొబైల్ నంబర్​ నుంచి ఎస్​ఎస్​ఎస్​ పంపడం ద్వారా కూడా పాన్​-ఆధార్​ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్​ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్​ నంబర్​ను, 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్​ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్​​ లింక్ పూర్తవుతుంది.

లింక్​ స్టేటస్​ తెలుసుకోవడం ఎలా? (Pan Aadhaar link status)

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్​ ఆధార్​ స్టేటస్​పై క్లిక్​ చేసి.. ఆధార్​, పాన్​ నంబర్​లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్​ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్​ తెలుసుకోవచ్చు.

ఎస్​ఎంఎస్ ద్వారా అయితే.. 12 అంకెల ఆధార్​ నంబర్​ను ఎంటర్​ చేసి స్పేస్​ ఇచ్చి.. 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్​ పంపడం ద్వారా లింక్ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.

లింక్ చేయకపోతే ఏమవుతుంది?

గడువులోపు పాన్-ఆధార్​​ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్​ 234హెచ్​ను కొత్తగా చేర్చింది.

గడువులోపు ఈ ప్రక్రియ పూర్తవకుంటే.. పాన్​ నిర్వీర్యం అవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి పాన్​ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.