పండుగ రోజున 'మారుతి' షాక్- కార్ల ధరలు భారీగా పెంపు

author img

By

Published : Jan 15, 2022, 12:03 PM IST

Maruti Suzuki

Maruti Suzuki Hikes Vehicle Prices: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ) కార్ల ధరలను పెంచింది. ప్రస్తుత మోడల్స్​పై 4.3శాతం వరకు ధరలను పెంచినట్లు పేర్కొంది.

Maruti Suzuki Hikes Vehicle Prices: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్​ఐ) వాహనాల ధరలను పెంచింది. కార్ల ధరలను 4.3శాతం వరకు పెంచినట్లు తెలిపింది. పెంచిన వాహనాల ధరలు శనివారమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరలను పెంచినట్లు తెలిపింది మారుతీ సుజుకీ.

"మారుతీ సుజుకీలోని వివిధ మోడల్ వాహనాలపై ధరలను 0.1 నుంచి 4.3శాతం వరకు పెంచాము. దిల్లీలోని ఎక్స్- షోరూంలో వాహనాల ధరలు 1.7శాతం పెరిగింది." అని మారుతీ సుజుకీ పేర్కొంది.

గతేడాదిలో ఏకంగా మూడు సార్లు కార్ల ధరలను పెంచింది మారుతీ. జనవరిలో 1.4, ఏప్రిల్​లో 1.6, సెప్టెంబర్​లో 1.9శాతం చొప్పున పెంచింది. ఈ మేరకు మొత్తం కలిపి.. గతేడాదిలో వాహనాల ధరలు 4.9శాతం పెంచింది మారుతీ.

ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరలను పెంచినట్లు గత నెలలో పేర్కొంది.

మారుతీ సుజుకీ ఇండియా(ఎమ్​ఎస్​ఐ) ఆల్టో నుంచి ఎస్​- క్రాస్ రేంజ్ కార్లను విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.3.15లక్షల నుంచి రూ.12.56లక్షల వరకు ఉంటుంది.

ఇదీ చూడండి: Corona Insurance: కరోనా వచ్చిందా.. కొత్తపాలసీ ఆలస్యమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.