ఆటోమొబైల్ రంగాన్ని చిప్ల కొరత(chip shortage) వేధిస్తోంది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(maruti suzuki production news)పై ఈ ప్రభావం ప్రత్యక్షంగా పడింది. సెప్టెంబర్లో తమ సంస్థ కార్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోని తమ ప్లాంట్లలో మొత్తం ఉత్పత్తి 40 శాతానికే పరిమితం కానుందని పేర్కొంది.
గురుగ్రామ్, మనేసర్లోని సంస్థ ప్లాంట్లలో సంవత్సరానికి 15 లక్షల యూనిట్ల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదనంగా సుజుకీ మోటార్ గుజరాత్(జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ విభాగం)కు ఏటా 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
"సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా వాహన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. హరియాణాతో పాటు గుజరాత్ ప్లాంట్లలో సెప్టెంబర్లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. పరిస్థితి క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత అంచనా ప్రకారం రెండు ప్రాంతాల్లో వాహన ఉత్పత్తి.. సాధారణ ఉత్పత్తిలో 40 శాతానికి పరిమితం అవ్వొచ్చు."
-మారుతీ సుజుకీ ప్రకటన
గతేడాదితో పోలిస్తే జులైలో వాహన ఉత్పత్తి 58 శాతం పెరిగినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. 1,70,719 యూనిట్లు తయారైనట్లు తెలిపింది. ఈ నెలలో హోల్సేల్ విక్రయాలు 1,62,462 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. గతేడాది జులైతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని స్పష్టం చేసింది.
చిప్లు ఎందుకు?
కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే సిలికాన్ చిప్లనే సెమీకండక్టర్లు అంటారు. వాహనాల్లో ఎలక్ట్రానిక్ ఫీచర్లు పెరిగిపోవడం వల్ల.. తయారీలో సెమీకండక్టర్ల వినియోగం బాగా పెరిగింది. కరోనాతో ఉత్పత్తి పడిపోవడం, సప్లై చైన్కు విఘాతం కలగడం వల్ల సెమీకండక్టర్ల కొరత(semiconductor shortage) వేధిస్తోంది.
ఇదీ చదవండి: