ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే

author img

By

Published : Nov 22, 2021, 10:24 AM IST

Airtel

ప్రీపెయిడ్​ రీఛార్జ్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ (airtel recharge) తెలిపింది. అన్ని ప్లాన్​ల​పై 20-25 శాతం ధరలు పెంచినట్లు పేర్కొంది. కొత్త రీఛార్జ్​ ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్(airtel recharge)..​ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్​ ధర 25శాతం.. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.

నూతన ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్​టెల్​ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50శాతం అధిక టాక్​టైం, 200జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.

మొబైల్ రీఛార్జ్​ ప్లాన్స్​ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి ​ సరాసరి రెవెన్యూ(ఏఆర్​పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్​టెల్​కు(airtel recharge) చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్​అప్స్​పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్​టెల్ పేర్కొంది.

ఇదీ చూడండి: గూగుల్​ పేలో కొత్త ఫీచర్.. వాయిస్​తో పేమెంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.