ETV Bharat / briefs

భాజపాకు 200 సీట్లు దాటవు: కేఏ పాల్

author img

By

Published : May 22, 2019, 8:01 PM IST

ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను మొదట సూచించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్‌ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

pal

భాజపాకు 200 సీట్లు దాటవు: కేఏ పాల్

భాజపాయేతర పక్షాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని తాను పిలుపునిస్తే.. ఏ రాజకీయ పార్టీ స్పందించలేదని దిల్లీలో వ్యాఖ్యానించారు. కౌంటింగ్ రోజున.. ఈవీఎంలకంటే ముందు వీవీ ప్యాట్​లు లెక్కించాలన్న 22 రాజకీయ పార్టీల విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి మంచిది కాదన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు తక్కువని.. భాజపాకు 200కు మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని అంచనా వేశారు. తమ పార్టీ అభ్యర్థుల బీ ఫామ్​లు ఎత్తుకెళ్లారని మరోసారి ఆరోపించారు. 30 నియోజకవర్గాల్లో రీ పోలింగ్ చేయాలని ఈసీని డిమాండ్ చేశారు.

Intro:ap_rjy_61_22_phone_call_bike_self_accident_c10


Body:తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం పై వెళ్తూ అదుపు తప్పి పడటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.. వేగంగా వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం తో వాహనం అదుపు తప్పింది.. ద్విచక్ర వాహనం రోడ్ పక్కన స్తంభాన్ని ఢీకొట్టింది.. ప్రమాదంలో గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన యిద్దరు తీవ్రంగా గాయపడ్డారు..వారికి ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. శ్రీనివాస్ ప్రత్తిపాడు 617


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.