సీఎం జగన్పై గలకరాయి దాడి కేసు - విచారణ ఈనెల 27కి వాయిదా - STONE attack on CASE
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 3:23 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-05-2024/640-480-21539722-thumbnail-16x9-ys-jagan-stone-pelting-case.jpg)
YS Jagan Stone Pelting Case Hearing: సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితుని ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు. కౌంటర్పై వాదనలు వినిపించేందుకు సతీష్ తరపు న్యాయవాది సలీం సమయం కోరారు. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
Stone Attack on CM Jagan: 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్కు స్వల్పగాయమైంది. జగన్ బస్సు యాత్ర విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్ మోహన్ రెడ్డి ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్ను అరెస్ట్ చేశారు.